![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2023/01/IMG-20230114-WA0016.jpg?fit=1040%2C780&ssl=1)
సామాజిక సారథి , నాగర్ కర్నూలు : మండల పరిధిలోని శ్రీపురం గ్రామంలో రంగ నాయక దేవాలయంలో శనివారం శ్రీ గోదాదేవి రంగనాయక స్వామి కళ్యాణోత్సవం వేద మంత్ర చరణల మధ్య శాస్త్రోక్తంగా వైభవంగా నిర్వహించారు . ఆలయ ప్రధాన అర్చకులు కురవి రామానుజచార్యులు తెలిపారు. ధనుర్మాసంలో 30 రోజులపాటు గోదాదేవి అమ్మవారిని వివిధ పాఠశాలలతో తిరుప్పావై ఆరాధన సేవా కాలం నిర్వహించి చివరి 30వ రోజు అమ్మవారికి రంగనాథ స్వామి వార్లకు వేదమంత్రచరణల మధ్య కల్యాణోత్సవాన్ని నిర్వహించినట్లు పూజారులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఎం ఎల్ సి తనయుడు డా . రాజేశ్ రెడ్డి దంపతులు హజరయేనారు .
![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2023/01/IMG-20230114-WA0017.jpg?resize=640%2C480&ssl=1)
ఈ కార్యక్రమంలో విశ్వక్సేన పూజ ,యజ్ఞోపవీత ధారణ, కంకణ ధారణ, జీలకర్ర బెల్లం, మాంగల్య ధారణ, తలంబ్రాలు, శాస్త్రోక్తంగా,వేద మంత్ర చరణాల మధ్య వేద బ్రాహ్మణుల అర్చక బృందం నిర్వహించారని ఆయన తెలిపారు. అనంతరం స్వామి అమ్మవార్లకు నివేదించిన ప్రత్యేక నైవేద్యాలను భక్తులకు వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు, మహిళలు, అధిక సంఖ్యలో పాల్గొన్నారు.