Breaking News

ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో మాజీ ఎమ్మెల్యే

ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో మాజీ ఎమ్మెల్యే

సారథి న్యూస్, వాజేడు: ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రంలో గురువారం భద్రాచలం మాజీ ఎమ్మెల్యే కుంజా సత్యవతి పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మొదటి ప్రాధాన్యత ఓటు వేసి నల్లగొండ, ఖమ్మం, వరంగల్​ బీజేపీ గ్రాడ్యుయేట్​ ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డిని గెలిపించాలని కోరారు. అనంతరం ఆమె ప్రభుత్వ జూనియర్ కాలేజీ, హైస్కూల్, హాస్పిటల్, తహసీల్దార్​, ఎంఈవో, ఎంపీడీవో కార్యాలయాలతో పాటు పోలీస్ స్టేషన్లను సందర్శించి ప్రచారం నిర్వహించారు. ఆమె వెంట వాజేడు మండల బీజేపీ అధ్యక్షుడు కిషోర్, ములుగు జిల్లా కమిటీ సభ్యులు సీతారామరాజు, మండల కార్యకర్తలు పాల్గొన్నారు.