Breaking News

సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలి

ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను వినియోగించుకోవాలి

సామాజిక సారథి, డిండి: దివ్యాంగులకు కల్పిస్తున్న సౌకర్యాలను, సదుపాయాలను వినియోగించుకోవాలని మండల విద్యాధికారి ఈ. సామ్య నాయక్ అన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 21రకాల వైకల్యాలను గుర్తించి, పెన్షన్ సౌకర్యం, విద్యా రంగంలో ప్రత్యేక పాఠశాలు, స్కాలర్షిప్లలు, అందజేస్తుందన్నారు. తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్ల ముందుకెళ్లాలని సూచించారు. సరైన ప్రోత్సాహం ఇస్తే అన్ని రంగాలలో రాణించగలరని ఆమె పేర్కొన్నారు.  ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం చందర్, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం స్పెషల్ ఆఫీసర్ లక్ష్మి, ఐఆర్పీ అంబికా, ఎల్డిఏ సరిత, సైదులు ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులు పాల్గొన్నారు.