Breaking News

ఉత్సాహంగా వరాహమూర్తుల పోటీలు

ఉత్సాహంగా వరాహమూర్తుల పోటీలు

సారథి న్యూస్, మానవపాడు: జోగుళాంబ గద్వాల జిల్లాలో తిక్కవీరేశ్వర స్వామి జాతర సందర్భంగా వరాహమూర్తుల పోటీలు ఉత్కంఠభరితంగా సాగాయి. అలాగే కుక్కల పోటీలు జరిగాయి. ఇదిలాఉండగా, ఏటా ఎడ్లబండ్ల లాగుడు పోటీలు నిర్వహిస్తారు. ఈ ఏడాది ఈ పోటీలతో పాటు రెండేళ్లుగా కుక్కల పరుగు పోటీలు, పందుల కొట్లాట పోటీలు నిర్వహిస్తున్నారు. తెలంగాణలోని పలు ప్రాంతాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ తదితర ప్రాంతాల నుంచి ఔత్సాహికులు తరలివచ్చారు.

పరుగెడుతున్న గ్రామసింహాలు