Breaking News

కృష్ణానీటిని అక్రమంగా తరలించొద్దు

కృష్ణానీటిని అక్రమంగా తరలించొద్దు

సారథి, కొల్లాపూర్: కృష్ణానది నీటిని అక్రమంగా ఏపీ ప్రభుత్వం తరలించడాన్ని నిరసిస్తూ శుక్రవారం మహబూబ్​నగర్ జిల్లా కేంద్రంలో జరిగిన ధర్నాను జయప్రదం చేయడానికి కొల్లాపూర్ నుంచి సీపీఐ నాయకులు బయలుదేరారు. కార్యక్రమంలో జిల్లా సమాఖ్య మహిళా కార్యదర్శి ఇందిర, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు కిరణ్, జిల్లా సమితి నాయకులు కురుమయ్య, కొల్లాపూర్ టౌన్ కార్యదర్శి ఎండీ యూసుఫ్, హమాలీ యూనియన్ అధ్యక్షుడు సత్యం, వెంకటాచలం, శీను, గంగన్న, హరికురుమయ్య, ఎల్లయ్య, వెంకటమ్మ, చిన్నమ్మ, కురుమయ్య, చెన్నకేశవులు, ఎం.నరసింహ, మండల సహాయ కార్యదర్శి తుమ్మల శివుడు పాల్గొన్నారు.