![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2024/02/IMG-20240226-WA0030.jpg?fit=1280%2C853&ssl=1)
సామాజిక సారధి, నాగర్ కర్నూల్:కల్యాణ లక్ష్మి , షాదీ ముబారక్ చెక్కులను 62 మందికి లబ్ధిదారులకు ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి పంపిణీ చేశారు. సోమవారం నియోజకవర్గంలోని ఐదు మండలాల పరిధిలోగల అరవై రెండు మంది లబ్ధిదారులకు చెందిన కళ్యాణ లక్ష్మి , షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు పేదల పక్షాన పనిచేస్తుందని, గత ప్రభుత్వం లో ఉన్న పథకాలను కూడా కొనసాగిస్తూ లబ్ధిదారులకు ఇలాంటి ఇబ్బంది కలగకుండా పాలన కొనసాగిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయా మండలాలకు చెందిన అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.