Breaking News

కరోనా పేషెంట్లకు పండ్లు పంపిణీ

కరోనా పేషెంట్లకు పండ్లు పంపిణీ

సారథి, జగిత్యాల రూరల్: నరేంద్రమోడీ ప్రధానమంత్రి గా బాధ్యతలు చేపట్టి ఏడేళ్లు విజయవంతంగా పూర్తిచేసుకున్న సందర్భంగా ఆదివారం జగిత్యాల రూరల్ మండలం పోరండ్లలో బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఆదేశాల మేరకు కొవిడ్ పేషెంట్లకు పండ్లు, మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో బీజేపీ జగిత్యాల రూరల్ మండల ఉపాధ్యక్షుడు నాగిరెడ్డి రాజిరెడ్డి, రురల్ మండల కోశాధికారి మెడపట్ల లక్ష్మణ్, బీజేవైఎం మండల ప్రధాన కార్యదర్శి పడిగెల మహిపాల్ రెడ్డి, బీజేపీ నాయకులు వంగ మధుకర్ రెడ్డి, సిరవేణి లక్ష్మణ్, కర్ణాల చంద్రశేఖర్, సిరవేణి మధుకర్, పడిగెల మల్లారెడ్డి, గూడ రాజిరెడ్డి, పడిగెల గోపాల్, పడిగెల సంజీవ్ పాల్గొన్నారు.