Breaking News

ఉద్యోగులకు సీపీఎస్​ శాపం

ఉద్యోగులకు సీపీఎస్​శాపం

సారథి న్యూస్, మానవపాడు: సీపీఎస్ విధానం ద్వారా 1.5లక్షల మంది ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని సీపీఎస్ ​జిల్లా అధ్యక్షుడు నాగరాజు అన్నారు. గురువారం జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండల కేంద్రంలో అగ్రికల్చర్​ ఆఫీసర్ ​శ్వేత, డిప్యూటీ తహసీల్దార్ ​రవికుమార్ ​చేతులమీదుగా టీఎస్​సీపీఎస్ ఈయూ క్యాలెండర్​ను ఆవిష్కరించారు. సీపీఎస్​ విధానాన్ని రద్దుచేయాలని డిమాండ్ ​చేస్తూ వచ్చేనెల 14న జిల్లా కేంద్రంలో భారీర్యాలీ నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఓపీఎస్ విధానాన్ని తీసుకొచ్చి ఉద్యోగులను కాపాడాలని రాష్ట్ర సలహాదారుడు విష్ణు కోరారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా గౌరవాధ్యక్షుడు బుచ్చన్న, పాల్వాయి లక్ష్మీనారాయణ, ప్రకాష్ రెడ్డి, ఈశ్వరయ్య, వీఆర్వోల జిల్లా సంఘం అధ్యక్షుడు ఆంజనేయులు, పంచాయతీ కార్యదర్శుల సంఘం అధ్యక్షుడు రాఘవేంద్రగౌడ్, రజనీకాంత్ రెడ్డి, చిన్నస్వాములు, కురుమయ్య, ప్రియాంక, మంజుల పాల్గొన్నారు.