![భవిత కేంద్రంలో తనిఖీ](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2021/07/pdp-8.jpg?fit=655%2C273&ssl=1)
సారథి, పెద్దశంకరంపేట: పెద్దశంకరంపేట మండల కేంద్రంలోని భవిత కేంద్రాన్ని జిల్లా సెక్టరియల్ అధికారి ఆర్.సూర్యప్రకాష్ శుక్రవారం సందర్శించి పలు రికార్డులను పరిశీలించారు. మండల ఐఈఆర్ డీ సమన్వయకర్తకు పలు సూచనలు చేశారు. మండలంలోని ప్రత్యేక అవసరాలు ఉన్న విద్యార్థుల సంఖ్య, వారికి అవసరమైన సదుపాయాలు, వారికి ఉన్న వనరులను ప్రత్యేకంగా మండల సమన్వయకర్తకు వివరించారు. ఆ దిశగా ప్రభుత్వం ప్రత్యేకావసరాలు కలిగిన పిల్లలకు కల్పిస్తున్న సౌకర్యాలు ప్రతి పిల్లవాడికి చేరేలా కృషిచేయాలని సూచించారు. టెలీసర్వీస్ ప్రతిరోజు పిల్లవాడికి 20 నిమిషాలు మాట్లాడాలని సూచించారు. అలగే ప్రతి శనివారం ఇంటి వద్ద చదువుకునే విధానం అందించాలని సూచించారు. కార్యక్రమంలో మండల విలీన విద్యాసమన్వయకర్త డి.రవికిరణ్, రాజు, డీఎల్ఎంటీ సచిన్ కుమార్, ఎంఐఎస్ సంపత్ రెడ్డి, కంప్యూటర్ ఆపరేటర్ సంగమేశ్వర్ పాల్గొన్నారు.