![శతాధిక వృద్ధుడి మృతి](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2021/05/1f.jpg?fit=320%2C376&ssl=1)
సారథి, పెద్దశంకరంపేట: పెద్దశంకరంపేట మండలంలోని కమలాపూర్ కింది తండాకు చెందిన శతాధిక వృద్ధుడు పాపియా నాయక్(110) బుధవారం మృతిచెందాడు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో బుధవారం ఉదయం చనిపోయాడు. శతాధిక వృద్ధుడు మృతి చెందడం పట్ల సర్పంచ్ ల ఫోరం మండలాధ్యక్షుడు కమలాపూర్ సర్పంచ్ కుంట్ల రాములు పలువురు ప్రజాప్రతినిధులు నాయకులు, గ్రామస్తులు, సంతాపం తెలిపారు.