![అట్టహాసంగా తల్లిపాల వారోత్సవాలు](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2021/08/icds.jpg?fit=655%2C343&ssl=1)
సారథి, పెద్దశంకరంపేట: మెదక్ జిల్లా పెద్దశంకరంపేటలోని 9వ నంబర్ అంగన్వాడీ కేంద్రంతో పాటు తిరుమలాపూర్ సెంటర్ ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాలను బుధవారం అట్టహాసంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన పబ్లిక్ హెల్త్ నర్సు సంపూర్ణ మాట్లాడుతూ.. పుట్టినబిడ్డకు తల్లిపాలే శ్రేష్టమని అన్నారు. ముర్రుపాలతో బిడ్డలో రోగనిరోధక శక్తి పెరిగి ఆరోగ్యవంతంగా ఉంటాడని ఆమె అవగాహన కల్పించారు. అనంతరం గర్భిణులు, బాలింతలతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులతో ర్యాలీ నిర్వహించి తల్లిపాల ఆవశ్యకతను వివరించారు. ఈ సందర్భంగా పలువురు మహిళలకు వైద్యారోగ్య పరీక్షలు నిర్వహించి ఏఎన్ఎం జ్యోతి మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు సరళ, స్వరూప, ఏఎన్ఎం జ్యోతి పాల్గొన్నారు.