Breaking News

స్కూలులో ఆకతాయిల వెకిలిచేష్టలు

స్కూలులో ఆకతాయిల వెకిలిచేష్టలు

గోడలపై అశ్లీల వెబ్ సైట్ రాతలు

సామాజిక సారథి, కాల్వశ్రీరాంపూర్: స్కూలులో ఆకతాయిల పిచ్చిరాతలు విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు కోపం తెప్పించాయి. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని పెగడపల్లి ప్రభుత్వ జడ్పీ హైస్కూల్​ ఆవరణలో పదవ తరగతి విద్యార్థులకు శనివారం వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి  జిల్లా విద్యాధికారి మాధవి, ఎంఈవో ఆరేపల్లి రాజయ్య హాజరయ్యారు. అక్కడికి వెళ్లిన పాత్రికేయులు, అధికారులు, విద్యార్థుల తల్లిదండ్రులు గోడల మీద రాతలు చూసి ఒక్కసారిగా అవాక్కయ్యారు. పాఠశాల కార్యాలయ గోడ పై భారతదేశ చిత్రపటంపై అశ్లీల వెబ్ సైట్ రాతలు దర్శనమివ్వడంతో అక్కడికి వచ్చిన తల్లిదండ్రులు ఒక్కసారిగా కంగుతిన్నారు. ఇదేమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం నుంచి పాఠశాల గోడపై రోత రాతలు దర్శనమిచ్చినప్పటికీ మధ్యాహ్నం వరకు ఉపాధ్యాయులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అక్కడికి వచ్చిన తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కూలు ఆవరణలో అశ్లీల వెబ్ సైట్ రాతలు రాసిన ఆకతాయిలను గుర్తించి చర్యలు చేపట్టాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఉపాధ్యాయులు నిర్లక్ష్యం వహించడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాల్వ శ్రీరాంపూర్ పోలీసులు పాఠశాల ప్రాంగణానికి చేరుకుని గోడలపై ఉన్న రాతలను తొలగించారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని, పిల్లల తల్లిదండ్రులు, గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.