![ప్రతి డ్యాం వద్ద బోటింగ్సౌకర్యం](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2021/02/hyd22.jpg?fit=677%2C368&ssl=1)
సారథి న్యూస్, హైదరాబాద్: హుస్సేన్సాగర్లో తెలంగాణ టూరిజం శాఖ ఏర్పాటుచేసిన క్రూయిజ్ బోట్ను టూరిజం శాఖ మంత్రి వి.శ్రీనివాస్గౌడ్, డిప్యూటీ సీఎం మహమూద్అలీ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ.. త్వరలోనే హుస్సేన్సాగర్లో కదిలే రెస్టారెంట్ బోట్ అందుబాటులోకి వస్తుందన్నారు. అలాగే దుర్గంచెరువులోనూ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పర్యాటకుల సౌకర్యార్థం రాష్ట్రంలోని ప్రతి డ్యాం వద్ద బోటింగ్ సౌకర్యం కల్పిస్తామన్నారు. గోవా నిపుణుల సహాయంతో రాష్ట్రంలో వాటర్ స్పోర్ట్స్ అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు. ప్రతి జిల్లాలో టూరిజం సర్క్యూట్ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ శ్రీనివాస్ గుప్తా, పర్యాటక శాఖ ఎండీ మనోహర్, కార్పొరేటర్లు పాల్గొన్నారు.
![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2021/02/hyd33.jpg?resize=640%2C305&ssl=1)