Breaking News

బలిజ కులస్తులను ఓబీసీలో చేర్చాలి

సామాజిక సారథి , నాగర్ కర్నూల్ బ్యూరో : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వెనుక పడ్డ వీర శైవ లింగ బలిజ కులస్తులను ఓబీసీ జాబితాలో చేర్చాలని ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి తనయుడు డాక్టర్ కూచుకుల్ల రాజేష్ రెడ్డి డిమాండ్ చేశారు . బుధవారం ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర బలిజ కులస్తులు చేస్తున్న నిరసన కార్యక్రమానికి వెళ్లి వారికి మద్దతు తెలిపారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు బలిజ కులస్తులను ఓబీసీ జాబితాలో చేర్చుతామని ప్రభుత్వం వారికి హామీ ఇచ్చిన సంగతి కేంద్ర ప్రభుత్వం బిజెపి మరిచిపోయిందని అన్నారు . ఇప్పటికీ బలిజ కులస్తుల్లో చాలామంది బీదవారు ఉన్నారని . వారిని ఓసి లో చేర్చడం వల్ల చాలామంది చదువుకున్న బలిజ కులస్థునికి చెందిన విద్యార్థులు , నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుందని వెంటనే వారి డిమాండ్ ను కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని నెరవర్చాలని వారు డిమాండ్ చేశారు . బలిజ కులస్తులను బీసీ , డీ ,లో చేర్చి వారికి . న్యాయం చేయాలని వారు కోరారు . ఈ కార్యక్రమంలో వీర శైవ లింగ బలిజ సంఘం నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షుడు రవికు , మార్ , గౌరవ అధ్యక్షులు జెమిని సురేష్ , ప్రధాన కార్యదర్శి రాజేష్ కుమార్ , నాయకులు మమ్మాయిపళ్లి రాజు , తదితరులు ఉన్నారు .