సామాజిక సారథి, సంగారెడ్డి: సంగారెడ్డి నుంచి శబరిమలకు కొక్కొండ శ్రీశైలం, సాహితీ రాము గురుస్వాముల ఆధ్వర్యంలో 22 మంది స్వాములు ప్రారంభించిన మహా పాదయాత్ర గురువారం 500 కిలోమీటర్లు చేరుకుంది. సంగారెడ్డి పట్టణంలోని నవరత్నాలయం నుంచి ఈ నెల 6వ తేదీన ప్రారంభమైన ఈ పాదయాత్ర తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్టాల మీదుగా 20 రోజుల తర్వాత కర్ణాటకకు చేరింది. డిసెంబర్ 15వ తేదీన శబరిమల చేరుకుంటామని గురుస్వాములు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎం.సత్యనారాయణ, విశ్వనాథ్ రావు, దామోదర్, గుండ్లపల్లి నరేష్, మానిక్ రెడ్డి, వెంకన్న, పరమేశ్వర్ గౌడ్, ప్రభు గౌడ్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.
- November 25, 2021
- Archive
- Top News
- మెదక్
- లోకల్ న్యూస్
- Comments Off on అయ్యప్ప స్వాముల మహా పాదయాత్ర