Breaking News

ఓట్లకోసమస్తారా?

ఓట్లకోసమస్తారా..?

– టీపీసీసీ కార్యదర్శి బండి సుధాకర్ గౌడ్

సామాజిక సారథి, వరంగల్: యాసంగి వడ్లు కొనమని చెప్పిన సీఎం కేసీఆర్ రైతుల ఓట్లు కోసమస్తామరా అని టీపీసీసీ కార్యదర్శి బండి సుధాకర్ గౌడ్ అన్నారు. ఈ సందర్భంగా మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దేశానికి తెలంగాణ సీడ్ బౌల్, కోటి ఎకరాల మాగాణి అంటూ చెప్పిన కేసీఆర్ మాటలు నేడు నీటి మూటలయ్యాని ఎద్దేవా చేశారు. అన్నదాతలను ఆదుకోలేని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వచ్చే ఎన్నికల్లో ఓట్లేట్ల అడుగుతారని మండిపడ్డారు. వానాకాలం పంట కొనమంటే వేసవికాలం పంట గురించి సీఎం మాట్లాడడం విడ్డురమన్నారు. ధాన్యం కొనుగోళ్లపై కేంద్రంతో తెల్చుకొస్తానని గొప్పలు చెప్పి, ఢిల్లీలో ప్రధాని అపాయింట్మెట్ దొరకలేదని సాకుల చెప్పి రాష్ట్ర రైతాంగాన్ని మోసం చేసినట్లేనని విరుచుకుపడ్డారు. టీఆర్ఎస్ పార్టీకి రెండుసార్లు అధికారం కట్టబెడితే స్వార్థ రాజకీయాల కోసం రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవాన్ని తకట్టు పెడుతున్నాడని ఆరోపించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని కొనాలని లేని పక్షంలో రైతులతో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.