![86కు చేరిన మృతుల సంఖ్య](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/08/LIQUOR-IN-PANJABBBFFFGGG.jpg?fit=700%2C300&ssl=1)
చండీగఢ్: పంజాబ్లో కల్తీ మద్యం తాగి మరణించిన వారిసంఖ్య 86కు చేరింది. ఇప్పటికే తరన్ తరన్ జిల్లాలో 19, అమృత్సర్లో 11, బాటాల జిల్లాలో 9 మంది చనిపోయారు. తాజాగా శనివారం తరన్ తరన్లో మరో 44 మంది, అమృత్సర్లో ఒకరు, బాటాల జిల్లాలో ఇద్దరు చనిపోవడంతో మొత్తం మృతుల సంఖ్య 86కు చేరుకుంది. ఈ కేసులో పోలీసులు ఇప్పటివరకు 10 మందిని అరెస్ట్చేశారు. ఏడుగురు ఎక్సైజ్ అధికారులు, ఆరుగురు పోలీసులను పంజాబ్ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. బాధిత కుటుంబాలకు రూ.రెండు లక్షల చొప్పున పరిహారం అందజేస్తామని సీఎం అమరీందర్సింగ్ ప్రకటించారు.