Breaking News

5వ తరగతి గురుకుల ప్రవేశ పరీక్ష ‘కీ’

5వ తరగతి గురుకుల ప్రవేశ పరీక్ష ‘కీ’

సామాజికసారథి, హైదరాబాద్: గురుకులాల ఉమ్మడి ప్రవేశ పరీక్ష 2022 ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. గురుకుల పాఠశాలల్లో 5వ తరగతిలో వచ్చే విద్యాసంవత్సరంలో ప్రవేశాల కోసం ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఈ ప్రవేశ పరీక్షకు 1,34,478 మంది విద్యార్థిని విద్యార్థులు హాజరయ్యారు. గత విద్యాసంవత్సరంలో 74,52 మంది మంది విద్యార్థులు మాత్రమే హాజరయ్యారు. గురుకుల పాఠశాలల్లో 5వ తరగతిలో 48,120 మంది విద్యార్థినీ విద్యార్థులకు ప్రవేశాలు లభిస్తాయి. ఒక్క సీటు కోసం సగటున ముగ్గురు విద్యార్థులు పోటీపడ్డారు. ప్రభుత్వం పెద్ద సంఖ్యలో గురుకులాలను ప్రారంభించడం, వాటిలో ఉచితంగా ఇంగ్లిష్ మీడియంలో ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యతో పాటు పోషకాహారాన్ని అందిస్తుండడంతో ప్రవేశాల కోసం పోటీ బాగా పెరిగింది. విద్యార్థుల అవగాహన కోసం ‘సామాజికసారథి’ కీ ఇచ్చింది. సరిచూసుకోవచ్చు.

5వ తరగతి గురుకుల ప్రవేశ పరీక్ష ‘కీ’

మంత్రి అభినందనలు
గురుకులాలకు సంబంధించి ప్రతిష్టాత్మకమైన ప్రవేశపరీక్షను విజయవంతంగా, ప్రశాంతంగా నిర్వహించినందుకు మంత్రి కొప్పుల ఈశ్వర్.. సాంఘిక సంక్షేమశాఖ గురుకుల విద్యాలయాల సంస్థ సొసైటీ కార్యదర్శి రొనాల్డ్ రోస్ అన్ని సొసైటీలకు చెందిన అధికారులు, సిబ్బందిని అభినందించారు. ఇదే ఉత్సాహంతో ఫలితాలు త్వరితగతిన ప్రకటించి, అడ్మిషన్లన కూడా సకాలంలో పూర్తిచేయాలని కోరారు. అత్యుత్తమ ఫలితాలు సాధించేలా వారి బంగారు భవిష్యత్​కు బాటలు వేయాలని మంత్రి కొప్పుల అధికారులను ఆదేశించారు.