Breaking News

36 లక్షలు దాటిన కేసులు

న్యూఢిల్లీ: మనదేశంలో కరోనా కేసులు ఏమాత్రం తగ్గడం లేదు. కరోనా వ్యాప్తి భయంకర స్థాయిలో పెరుగుతున్నది. గత 24 గంటల్లో 78,512 కొత్తకేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 36,21,245కు చేరుకున్నది. కాగా ఇప్పటివరకు మొత్తం 64,469 మంది కరోనాబారిన పడి ప్రాణాలు కోల్పోయారు. 27,74,801 మంది కరోనా నుంచి కోలుగోగా, 7,81,975 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్సపొందుతున్నారు.