Breaking News

11న పాత వాహనాల వేలం

11న పాత వాహనాల వేలం

సారథి న్యూస్, హుస్నాబాద్: పాత వాహనాలను వేలం పాట వేయనున్నట్లు ఏసీపీ సందెపోగు మహేందర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన మాట్లాడుతూ.. హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీస్ ఉన్నతాధికారులు తనిఖీల్లో అబాండెడ్ మోటర్ సైకిల్ అండ్ స్కూటర్లు 35, మహేంద్ర ట్రాక్టర్ ఒకటి, ఒక మారుతి కారు, ఒక టాటా ఏస్​ ఆటో.. ఇలా మొత్తం 38 వెహికిల్స్​ పట్టుబడినట్లు తెలిపారు. వాటి యజమానులు ముందుకు రాకపోవడంతో వాటిని(అన్​నోన్​ ప్రాపర్టీ) కింద పరిగణించి ఈనెల 11న ఉదయ 10గంటలకు వేలం పాట వేయనున్నట్లు తెలిపారు. ఆసక్తి ఉన్నవారు వేలంపాటలో పాల్గొని ఆయా వాహనాలకు వెంటనే డబ్బులు చెల్లించి తీసుకెళ్లొచ్చని ఏసీపీ పేర్కొన్నారు. సీఐ రఘుపతిరెడ్డి, సిద్దిపేట ఏఆర్ హెడ్ క్వార్టర్​ ఆర్ఎస్ఐ ప్రదీప్, ఎంవీఐలను నియమించినట్లు తెలిపారు.