Breaking News

సూర్యాపేటపై నజర్​

సూర్యాపేటపై నజర్​

సారథి న్యూస్​, సూర్యాపేట: సూర్యాపేట జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసులు రోజురోజుకూ పెరుగుతుండడంతో ముఖ్యమంత్రి జిల్లాపై నజర్‌ పెట్టారు. సీఎం కేసీఆర్​ ఆదేశాల మేరకు బుధవారం సూర్యాపేటలో సీఎస్‌ సోమేశ్‌కుమార్‌,  డీజీపీ మహేందర్‌రెడ్డి, వైద్య, ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఐజీ స్టీఫెన్‌ రవీంద్ర పర్యటించారు. కరోనా వైరస్‌ వ్యాప్తికి కారణమైన మార్కెట్‌ బజార్‌ను పరిశీలించారు. అనంతరం కలెక్టరేట్​లో కలెక్టర్‌ టి.వినయ్‌ కృష్ణారెడ్డి, ఎస్పీ ఆర్‌.భాస్కరన్, జిల్లా అధికారులతో పరిస్థితిపై సమీక్షించారు. అనంతరం సీఎస్‌ జిల్లా పరిస్థితులపై మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. సూర్యాపేటలో ఇప్పటివరకు 83 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. పరిస్థితి త్వరలోనే కంట్రోల్​ లోకి వస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు. డీజీపీ మహేందర్​రెడ్డి మాట్లాడుతూ.. సూర్యాపేట జిల్లాలో పాజిటివ్ కేసుల తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో సందర్శించామన్నారు. ఇరుగు పొరుగు ఇళ్లవాళ్లు కూడా కాంటాక్ట్​ లో ఉండకూడదన్నారు.