Breaking News

సుప్రీమ్ హీరో మరో సినిమా

సుప్రీమ్ మరో సినిమా

హిట్, ప్లాప్ లతో సంబంధం లేకుండా సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ జెట్ స్పీడ్ తో సినిమాలు చేస్తున్నాడు. రేపు ‘సోలో బ్రతుకే సో బెటర్’ విడుదలవుతుండగా గురువారం కొత్త సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభించాడు. మిస్టికల్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందనున్న ఈ చిత్రానికి ‘భమ్ బోలేనాథ్’ ఫేమ్ కార్తీక్ వర్మ దండు దర్శకత్వం వహిస్తున్నాడు. స్టార్ డైరెక్టర్ సుకుమార్ స్క్రీన్ ప్లే అందిస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బీవీఎస్ఎన్ ప్రసాద్, సుకుమార్ రైటింగ్స్ పతాకంపై సుకుమార్ కలిసి ఈ మూవీని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సాయి తేజ్ తన కెరీర్ లో మొదటిసారిగా మిస్టికల్ థ్రిల్లర్ జోనర్ లో నటించనున్నాడు. ‘సిద్ధార్థ నామ సంవత్సరే.. బృహస్పతి: సింహరాశౌ.. స్థిత సమయే.. అంతిమ పుష్కరే’ అంటూ అనౌన్స్​మెంట్​ పోస్టర్ లోనే ఇదొక డిఫరెంట్ కాన్సెప్ట్ తో రూపొందే సినిమా అని హింట్ ఇచ్చారు. మరి తేజ్ కు ఈ #SDT15 ఆధ్యాత్మిక థ్రిల్లర్ ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి. భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న చిత్రానికి సంబంధించిన నటీనటులు సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు.