Breaking News

సీఎం సంకల్పం మేరకే ఇళ్లు

సారథి న్యూస్​, సూర్యాపేట: సీఎం కేసీఆర్​ సంకల్పం మేరకే డబుల్​ ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నామని మంత్రి గుంటకండ్ల జగదీశ్వర్​రెడ్డి అన్నారు. గురువారం సూర్యాపేట నియోజకవర్గం చివ్వెంల మండలం గుంపుల తిరుమలగిరిలో 82 డబుల్​ బెడ్ రూమ్​ ఇళ్లను మంత్రి ప్రారంభించారు. అలాగే 80 మంది లబ్ధిదారులు గృహప్రవేశం చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి అంశాన్ని విధిగా అమలు చేస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, జడ్పీ చైర్​పర్సన్​ దీపిక పాల్గొన్నారు.