Breaking News

సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం

సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం

సారథి న్యూస్, ఖిల్లా వరంగల్: కొత్త రెవెన్యూ చట్టం అసెంబ్లీలో ఆమోదం పొందిన నేపథ్యంలో వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఆదేశాల మేరకు ఖిల్లా వరంగల్ చమన్ సెంటర్​లో శుక్రవారం సీఎం కేసీఆర్​ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ​నాయకుడు దామోదర్ యాదవ్ మాట్లాడుతూ.. బూజుపట్టిన రెవెన్యూ వ్యవస్థలో మార్పులు తీసుకురావడానికి సీఎం కేసీఆర్​అహర్నిశలు కృషిచేస్తున్నారని కొనియాడారు. రెవెన్యూ నూతన చట్టం ద్వారా రైతులు, ప్రజల ఇబ్బందులు తొలగిపోతాయని అన్నారు. కార్యక్రమంలో వేల్పుల నందు, రావుల రాజేష్, రాంబాబు, నవీన్, చిన్ని, సాయిబాబా, మైదం వేణు, మైదం రవి తదితరులు పాల్గొన్నారు.