![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/08/singer-suneethaff.jpg?fit=700%2C420&ssl=1)
కరోనా మహమ్మారి సామాన్యులతోపాటు సెలబ్రిటీలను సైతం పట్టి పీడిస్తోంది. తాజాగా టాలీవుడ్ సింగర్ సునీతకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా ఆమె ఓ వీడియోలో వెల్లడించారు. సునీతకు కరోనా సోకినట్టు మంగళవారం ఉదయం నుంచి సోషల్మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. ఈ నేపథ్యంలో సునీత స్వయంగా వీడియోను విడుదల చేశారు. తనకు కరోనా వచ్చినమాట వాస్తవమేనని.. అయితే తాను హోం ఐసోలేషన్లో ఉండి చికిత్స తీసుకున్నానని.. ప్రస్తుతం కోలుకున్నానని ఆమె చెప్పారు. ప్రముఖ నేపథ్య గాయకుడు బాలసుబ్రహ్మణ్యం కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని తాను ఆకాంక్షిస్తున్నట్టు ఆమె పేర్కొన్నారు. మరోవైపు యువ నేపథ్య గాయని మాళవికకు కూడా కరోనా సోకినట్టు సమాచారం. కాగా ఈ విషయంపై అధికారిక సమాచారం రాలేదు.