Breaking News

సరుకులు పంపిణీ

సరుకులు పంపిణీ

సారథి న్యూస్​, గోదావరిఖని: పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో జయహో మహిళా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం గర్భిణులకు పండ్లు, కూరగాయలు, బియ్యం, ఇతర నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.

కార్యక్రమంలో వన్​ టౌన్ ఏఎస్సై శారద, జయహో మహిళా అధ్యక్షురాలు జక్కిని శ్రీలత, కానిస్టేబుల్  సుమలత, అంగన్​వాడీ టీచర్లు తిరుమల, సరస్వతి, ఆశా వర్కర్ రాధ పాల్గొన్నారు.