Breaking News

సంక్షేమంలో తెలంగాణ ఆదర్శం

  • ఎమ్మెల్యే కోరుకంటి చందర్

సారథి న్యూస్, గోదావరిఖని: రైతుల ఆర్థికాభివృద్ధికి అహర్నిషలు పాటుపడుతూ సీఎం కేసీఆర్ ఆదర్శంగా నిలుస్తున్నారని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కొనియాడారు. శనివారం పాలకుర్తి మండలం తక్కలపల్లిలో ఎస్ఆర్ఎస్ కాలువలో పుడికతీత, చెట్ల తొలగింపు పనులతో పాటు
రూ.76 లక్షల నిధులతో రోడ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ నిర్వహించారు. విజయమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉపాధిహామీ కులీలకు అంబలి, అన్నదానం నిర్వహించారు. రైతులు, కూలీలు కరోనా వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని, మాస్కులు తప్పకుండా ధరించాలన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ కందుల సంధ్యారాణి, ఎంపీపీ అనసూయ, వైస్ ఎంపీపీ ఎర్రం స్వామి, సర్పంచ్ దుర్గం జగన్, దుర్గం కుమార్, సహకార సంఘ చైర్మన్ మామిడాల ప్రభాకర్ పాల్గొన్నారు.