ముంబై: లాక్ డౌన్తో రెండు నెలలుగా ఇంటికే పరిమితమైన క్రికెటర్ శార్దూల్ ఠాకూర్ ఎట్టకేలకు శనివారం స్థానిక బోయ్ సర్ మైదానంలో ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. అయితే దీనికి బీసీసీఐ నుంచి అనుమతి తీసుకున్నాడో లేదో తెలియదు. లాక్ డౌన్ తర్వాత ట్రైనింగ్ మొదలుపెట్టిన భారత క్రికెటర్ శార్దూల్ కావడం విశేషం. లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా మహారాష్ట్ర ప్రభుత్వం గ్రీన్, ఆరెంజ్ జోన్లలో స్టేడియాలను తెరిచేందుకు అనుమతి ఇచ్చింది.దీంతో శార్దూల్.. కొంతమంది దేశవాళీ క్రికెటర్లతో కలిసి ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. సుదీర్ఘకాలం తర్వాత ప్రాక్టీస్పై శార్దూల్ సంతోషం వ్యక్తంచేశాడు. మైదానంలో పరుగెత్తుతుంటూ కొత్తగా అనిపిస్తోందన్నాడు. అయితే బీసీసీఐతో కాంట్రాక్ట్ ఉన్న ప్లేయర్ బోర్డు అనుమతి లేకుండా ప్రాక్టీస్ మొదలుపెట్టడం నిబంధనలకు విరుద్ధమని ఓ అధికారి వెల్లడించారు.
- May 24, 2020
- క్రీడలు
- BCCI
- MIMBAI
- బీసీసీఐ
- మహారాష్ట్ర
- శార్దూల్
- Comments Off on శార్దూల్.. ప్రాక్టీస్ షురూ