Breaking News

వెంకటేష్​, శేఖర్ కమ్ముల కాంబినేషన్​

వెంకటేష్​, శేఖర్​ కమ్ముల కాంబినేషన్​

టాలీవుడ్​లో ఫీల్ గుడ్ ఫిల్మ్ మేకర్స్​లో ఒకరైన శేఖర్ కమ్ముల ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లు దాటుతోంది. తీసిన సినిమాలు పది. అన్నీ గుర్తింపు పొందిన సినిమాలే. గ్యాప్​లు ఎక్కువ తీసుకున్నా కంటెంట్ ప్రాధాన్యం ఉన్న సినిమాలే తీయడం శేఖర్ కమ్ముల స్టైల్. ప్రేక్షకుల ఎదురు చూపులు, అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా సినిమా కథల ఎంచుకునే డైరెక్టర్ శేఖర్ ‘ఫిదా’ చిత్రం తర్వాత శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్​పై నాగచైతన్య, సాయిపల్లవి హీరో హీరోయిన్లుగా ‘లవ్ స్టోరీ’ మూవీని తెరకెక్కించాడు.

లాక్ డౌన్ కారణంగా ఈ చిత్రం ఇంకా విడుదలకు నోచుకోలేదు. శేఖర్ ఆ సినిమా గురించి వర్రీ అవకుండా తర్వాత చేయాల్సిన ఫిల్మ్​పై దృష్టిసారించాడు. గతంలో తాను ఏషియన్ సునీల్ బ్యానర్ లో చిత్రాన్ని చేయనున్నట్లు ప్రకటించాడు. ఇప్పుడు అది కన్ఫేమషన్ దిశగా ఉంది. శేఖర్ ఇప్పటి వరకూ తన చిత్రాలో కొత్త వారిని ఇంట్రడ్యూస్ చేశాడు.. తర్వాత యంగ్ స్టార్ హీరోస్ రానా, వరుణ్ తేజ్, చైతూలతో సినిమాలు చేశాడు.. కారణం తెలికపోయినా సీనియర్ హీరోలతో సినిమా మాత్రం చేయలేదు. ఇప్పుడు ఆ ప్రయత్నం చేస్తున్నాడు.

విక్టరీ వెంకటేష్ హీరోగా ఏషియన్ సునీల్ బ్యానర్ పై సినిమా చేయనున్నాడని సతమాచారం. ప్రస్తుతం ‘నారప్ప’ సినిమాతో బిజీగా ఉన్న వెంకటేష్ ఆ సినిమా తర్వాత శేఖర్ కమ్ముల మూవీకి కమిట్​అవ్వనున్నాడని.. శేఖర్ ఇంతకు ముందు తీసిన చిత్రాలకంటే ఇది భిన్నంగా ఉంటుందని ‘ఫిదా’ను మించిన కమర్షియల్ చిత్రమని ఇండస్ట్రీ టాక్. వచ్చే ఏడు వీరిద్దరి కాంబినేషన్​ఉండబోతుందని ఇండస్ట్రీ టాక్.