![వీఆర్వోల నుంచి భూరికార్డుల స్వాధీనం](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/09/cpd-2.jpg?fit=677%2C443&ssl=1)
సారథి న్యూస్, రామడుగు, రామాయంపేట, కౌడిపల్లి: రాష్ట్రంలో నూతన రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చి వీఆర్వో వ్యవస్థను రద్దుచేయనున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం వీఆర్వోల నుంచి పలు భూసంబంధిత రికార్డులను రెవెన్యూశాఖ ఉన్నతాధికారులు స్వాధీనం చేసుకున్నారు. అందులో భాగంగానే కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలో రికార్డులను తీసుకున్నారు. అలాగే మెదక్ జిల్లా.. మెదక్ ఆర్డీవో సాయిరాం నిజాంపేట మండలంలోని పలు గ్రామాల వీఆర్వోల వద్ద నుంచి భూరికార్డులను స్వాధీనం చేసుకున్నారు. కార్యక్రమంలో మండల తహసీల్దార్ జయరాం, గిర్దవర్ యూసుఫ్, పలు గ్రామాల వీఆర్వోలు ఉన్నారు. అలాగే ప్రభుత్వ ఆదేశాల మేరకు మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలోని ఆయా గ్రామాల వీఆర్వోల దగ్గర నుంచి భూ రికార్డులను కౌడిపల్లి తహసీల్దార్ రాణాప్రతాప్ సింగ్ స్వాధీనం చేసుకున్నారు.
![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/09/rmpt-2.jpg?resize=640%2C372&ssl=1)
![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/09/kdply_record.jpg?resize=640%2C339&ssl=1)