Breaking News

వీఆర్వోల నుంచి భూరికార్డుల స్వాధీనం

వీఆర్వోల నుంచి భూరికార్డుల స్వాధీనం

సారథి న్యూస్, రామడుగు, రామాయంపేట, కౌడిపల్లి: రాష్ట్రంలో నూతన రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చి వీఆర్వో వ్యవస్థను రద్దుచేయనున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం వీఆర్​వోల నుంచి పలు భూసంబంధిత రికార్డులను రెవెన్యూశాఖ ఉన్నతాధికారులు స్వాధీనం చేసుకున్నారు. అందులో భాగంగానే కరీంనగర్​ జిల్లా రామడుగు మండలంలో రికార్డులను తీసుకున్నారు. అలాగే మెదక్​ జిల్లా.. మెదక్ ఆర్డీవో సాయిరాం నిజాంపేట మండలంలోని పలు గ్రామాల వీఆర్వోల వద్ద నుంచి భూరికార్డులను స్వాధీనం చేసుకున్నారు. కార్యక్రమంలో మండల తహసీల్దార్ జయరాం, గిర్దవర్ యూసుఫ్, పలు గ్రామాల వీఆర్వోలు ఉన్నారు. అలాగే ప్రభుత్వ ఆదేశాల మేరకు మెదక్​ జిల్లా కౌడిపల్లి మండలంలోని ఆయా గ్రామాల వీఆర్వోల దగ్గర నుంచి భూ రికార్డులను కౌడిపల్లి తహసీల్దార్​ రాణాప్రతాప్ సింగ్ స్వాధీనం చేసుకున్నారు.

మెదక్​ జిల్లా రామాయంపేట లో రెవెన్యూ రికార్డులను స్వాధీనం చేసుకుంటున్న ఉన్నతాధికారులు
మెదక్​ జిల్లా కౌడిపల్లి మండలంలో..