Breaking News

వారి సేవలు వెలకట్టలేనివి

సారథి న్యూస్​, వనపర్తి: మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుందామని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం మున్సిపాలిటీ సిబ్బందిని సన్మానించి వారితో కలిసి సహపంక్తి భోజనం చేశారు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో పారిశుద్ధ్య కార్మికుల బాధ్యత వెలకట్టలేనిదన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా, ఎస్పీ అపూర్వరావు పాల్గొన్నారు.