Breaking News

వలస కార్మికుల లిస్టు రెడీ చేయండి

వలస కార్మికుల లిస్టు రెడీ చేయండి

సారథి న్యూస్​, మహబూబ్​ నగర్​: కరోనా కారణంగా ఇప్పటి వరకు ఇతర ప్రాంతాల్లో చిక్కుకుపోయి జిల్లాకు వస్తున్న వలస కార్మికులపై ప్రత్యేకదృష్టి పెట్టాలని మహబూబ్​ నగర్​ జిల్లా కలెక్టర్ ఎస్.వెంకటరావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన కలెక్టరేట్​ లో వారితో సమీక్షించారు. జిల్లా నుంచి వెళ్లేవారి లిస్టును రెడీ చేయాలని సూచించారు.

బయటి ప్రాంతాల నుంచి వచ్చిన వారందరినీ హోం క్వారంటైన్​ లో ఉంచాలని, ఎవరికైనా కరోనా అనుమానిత లక్షణాలు గుర్తించినట్లయితే ప్రభుత్వ ఆస్పత్రి, ఎస్​వీఎస్​ ఆస్పత్రికి తరలించాలని సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటివరకు గ్రామీణ ప్రాంతాల్లో 17 రకాల పరిశ్రమలకు మినహాయింపు ఇచ్చాయని గుర్తుచేశారు. సమావేశంలో డీఆర్వో స్వర్ణలత, ఆర్డీవో శ్రీనివాసులు, డీఎస్పీ శ్రీధర్, డీఎంహెచ్​ వో డాక్టర్ కృష్ణ, డాక్టర్ శశికాంత్, ఆర్టీసీ పాల్గొన్నారు.