Breaking News

వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం

వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం

సారథి న్యూస్, నాగర్ కర్నూల్: జిల్లా కేంద్రం సమీపంలోని నాగనూల్ గ్రామంలో నాగర్ కర్నూల్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శనివారం ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ప్రారంభించారు. కరోనా వైరస్ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రైతుల వద్దకే వచ్చి ధాన్యం కొనుగోలు చేస్తుందన్నారు. కొనుగోలు కేంద్రంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని పీఏసీఎస్ అధికారులను ఆదేశించారు. రైతులు సామాజిక దూరం పాటించేలా చూడాలని సూచించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఈశ్వర్ రెడ్డి, జడ్పీటీసీ శ్రీశైలం పీఏసీఎస్ చైర్మన్, శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ కల్పన, వైస్ చైర్మన్ బాబురావు, కౌన్సిలర్లు, పీఏసీఎస్ డైరెక్టర్లు, అధికారులు పాల్గొన్నారు.