![రైతులు ఏకం కావాలి](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/08/MINISTER-GADWALLLFF.jpg?fit=700%2C389&ssl=1)
సారథి న్యూస్, మానవపాడు: జనాభాలో 60 శాతం ఉన్న రైతులు, రైతు అనుబంధ రంగాలను ఒక్క తాటిపైకి తీసుకురావడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని వ్యవసాయశాఖ మంత్రి ఎస్.నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. అందుకోసమే ప్రభుత్వం రైతు వేదికలను నిర్మిస్తున్నదని చెప్పారు. శనివారం ఆయన జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో రైతు వేదికల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. ఆయా సమావేశాల్లో మంత్రి మాట్లాడుతూ.. ప్రపంచంలో కొన్ని దేశాలు మాత్రమే వ్యవసాయ ఆధారిత దేశాలని.. అందులో మనదేశం ఒకటని చెప్పారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ కె.సరిత, ఎమ్మెల్యే అబ్రహం, వినియోగదారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు గట్టు తిమ్మప్ప, అదనపు కలెక్టర్ పి.శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ రమాదేవి, మార్కెట్ యార్డు చైర్మన్ రాందేవరరెడ్డి, తహసీల్దార్ లక్ష్మీ, ఎంపీడీవో రమణ, జెడ్పీటీసీలు కాశపోగు రాజు, రాములమ్మ, సర్పంచ్ మార్థమ్మ, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.