Breaking News

రెమ్యునరేషన్ పెంచేశాడు

రెమ్యునరేషన్ పెంచేశాడు

ప్రస్తుత పరిస్థిల్లో హీరో హీరోయిన్లంతా తమ రెమ్యునరేషన్ తగ్గించుకుంటుటే.. నిన్న మొన్న హీరో పొజిషన్ కు చేరుకున్న సత్యదేవ్ మాత్రం తన రెమ్యునరేషన్ పెంచుకుంటూ వెళ్తున్నాడట. ఎలాంటి ఫిల్మ్ బ్యాక్​గ్రౌండ్ లేకుండా సపోర్టింగ్ క్యారెక్టర్స్​తో ఇండస్ట్రీకి వచ్చి హీరో స్థాయికి చేరుకున్న సత్యదేవ్ పూరి జగన్నాథ్ ‘జ్యోతి లక్ష్మి’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘ఉమా మహేశ్వర్ ఉగ్ర రూపస్య’ సినిమాతో హీరోగా మరో మెట్టు ఎక్కాడు. అలానే వెబ్ వరల్డ్ లో అడుగుపెట్టి ‘గాడ్స్ ఆఫ్ ధర్మపురి’ ‘లాక్డ్’ అనే వెబ్ సిరీస్ లలో కూడా నటించాడు. దీంతో సత్యదేవ్ కు ఉన్న డిమాండ్ మేరకు రెమ్యూనరేషన్ కూడా బాగానే డిమాండ్ చేస్తున్నాడని టాక్ వినిపిస్తోంది.

‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ సినిమా తర్వాత మోస్ట్ వాంటెడ్ యాక్టర్స్ లో ఒకడయ్యాడు. క్రేజీ ప్రాజెక్ట్స్ లో హీరోగా నటించే ఛాన్స్ దక్కించుకుంటున్నాడు. ప్రస్తుతం ‘గుర్తుందా శీతాకాలం’ అనే సినిమాలో మిల్కీబ్యూటీ తమన్నాతో కలిసి నటిస్తున్నాడు. ఇది కన్నడ సూపర్ హిట్ ‘లవ్ మాక్ టైల్’ చిత్రానికి రీమేక్ గా తెరకెక్కుతోంది. దీంతో పాటు ‘తిమ్మరుసు’ అనే డిఫరెంట్ కాన్సెప్ట్ తో రానున్న సినిమాని స్టార్ట్ చేశాడు. అయితే ఇప్పుడు తాను నటించే సినిమాలకు వెబ్ సిరీస్ లకు సత్యదేవ్ సుమారు రూ.కోటి వరకు డిమాండ్ చేస్తున్నాడట. ‘గుర్తుందా శీతాకాలం’ మూవీకి రూ.కోటి డిమాండ్ చేసిన సత్య.. చివరకు రూ.75 లక్షల వరకు డీల్ కుదుర్చున్నాడని టాక్. ఇక ‘తిమ్మరుసు’ సినిమాకి కూడా అదే రేంజ్ లో డిమాండ్ చేశాడట. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న సామెత సత్యదేవ్ బాగా వంటబట్టించుకున్నాడని.. అందుకే క్రేజీ ఉన్నప్పుడే క్యాష్ చేసుకోవాలి అనే కాన్సెప్ట్ ను బాగానే ఫాలో అవుతున్నాడని ఫిలిం సర్కిల్స్ లో కామెంట్స్ వినిపిస్తున్నాయి. కానీ ఈ విషయాలన్నీ ఎంతవరకూ నిజం.. లెక్క తేలేదెలా అన్నది మాత్రం సస్పెన్స్ గానే ఉంది.