Breaking News

రెడ్​జోన్లలో కార్యకలాపాలు వద్దు

రెడ్​జోన్లలో కార్యకలాపాలు వద్దు

సారథి న్యూస్, శ్రీకాకుళం: రెడ్ జోన్లలో ఎలాంటి  కార్యకలాపాలు నిర్వహించకూడదని ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలంసాహ్ని స్పష్టం చేశారు. సాయంత్రం జిల్లా కలెక్టర్లతో ఆమె వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కంటైన్​ మెంట్​ జోన్లలో డోర్ డెలివరీ సౌకర్యం పెంచాలని సూచించారు. కరోనా నియంత్రణలోజిల్లా కలెక్టర్లు, ఇతర అధికారులు చాలా శ్రమిస్తున్నారని, వారందరికీ సెల్యూట్ చేస్తున్నట్లు ఆమె చెప్పారు. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్​ కేఎస్ జవహర్ రెడ్డి మాట్లాడుతూ.. జిల్లాల్లో ప్రసూతి, గుండె జబ్బులు తదితర కేటగిరీల వారీగా ఆస్పత్రులు ఉండే విధంగా చర్యలు చేపట్టాలని సూచించారు. సమావేశంలో కలెక్టర్ జె.నివాస్, జాయింట్ కలెక్టర్ డాక్టర్​ కె. శ్రీనివాసులు, సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ అధికారి సీఎం సాయికాంత్ వర్మ పాల్గొన్నారు.