Breaking News

రామలింగారెడ్డి కుటుంబానికి కేసీఆర్ పరామర్శ

రామలింగారెడ్డి కుటుంబానికి సీఎం కేసీఆర్​ పరామర్శ

సారథి న్యూస్, సిద్దిపేట: అనారోగ్యంతో మృతిచెందిన సిద్దిపేట జిల్లా దుబ్బాక ఎమ్మెల్యే, అంచనాల కమిటీ చైర్మన్ సోలిపేట రామలింగారెడ్డి అంత్యక్రియలకు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు హాజరయ్యారు. భౌతికకాయానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఆయన వెంట మంత్రి హరీశ్ రావు, పలువురు ఎమ్మెల్యేలు ఉన్నారు.