ఢిల్లీ: రాజస్థాన్లో రాజకీయ సంక్షోభం ఏర్పడింది. కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీలో పడిపోయింది. తన వెంట 30మంది ఎమ్మెల్యేలు ఉన్నారని ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ ప్రకటించారు. రేపు రాజస్థాన్లో జరగబోయే కాంగ్రెస్ శాసనసభ సమావేశానికి తాను తన మద్దతుదారులైన ఎమ్మెల్యేలు హాజరు కావడం లేదని ఆయన కుండబద్దలు కొట్టారు. రాజస్థాన్లో మొత్తం 200 స్థానాలకు గానూ, కాంగ్రెస్కు 107 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. 12 మంది స్వతంత్రలు ఆపార్టీకి మద్దతు ఇస్తున్నారు. కాగా ఇందులో నుంచి 30 మంది సచిన్ పైలట్ వెంట ఉన్నట్టు సమాచారం. రాజస్థాన్లో కాంగ్రెస్పార్టీని కూల్చేందుకు బీజేపీ యత్నిస్తున్నదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఆరోపించిన విషయం తెలిసిందే. బీజేపీ సచిన్పైలట్ వెనుక ఉండి ఈ డ్రామా నడిపిస్తున్నదని పలువురు కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. కాగా రేపు జరుగబోయే కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశానికి ఎంతమంది హాజరవుతారో అనే దాన్ని బట్టి రాజస్థాన్ రాజకీయాలు తేలనున్నాయి. మరోవైపు రాజస్థాన్ పరిణామాలపై కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం ఆలస్యంగా మేల్కొన్నది. ఆదివారం సాయంత్రం కొంతమంది కాంగ్రెస్ పెద్దలు రాజస్థాన్కు వెళ్లినప్పటికీ అప్పటికే పరిస్థితి చేయిదాటిపోయింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సచిన్ పైలట్కు భారీప్యాకేజీ ఆశచూపి తనవైపుకు తిప్పుకున్నట్టు సమాచారం. రాజస్థాన్లో సచిన్పైలట్ను సమన్వయం చేసుకుంటూ పాలనసాగించడంలో సీఎం అశోక్ గెహ్లాట్ విఫలమయ్యారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ అవకాశాన్ని బీజేపీ చక్కగా వినియోగించుకున్నది.
- July 12, 2020
- Archive
- Top News
- జాతీయం
- BJP
- CONGRESS
- GOVERNMENT
- RAJASTHAN
- SACHIN PILOT
- మైనార్టీ
- రాజకీయ సంక్షోభం
- Comments Off on రాజస్థాన్లో రాజకీయ సంక్షోభం