![రంగోళీ ట్వీట్ చేసిన ఆర్థికమంత్రి](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/08/NIRMALA-2F.jpg?fit=677%2C381&ssl=1)
న్యూఢిల్లీ: అయోధ్య రామజన్మభూమిలో మందిరం నిర్మాణం కోసం శంకుస్థాపన జరుగుతున్న సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రంగోళీని ట్వీట్ చేశారు. ఒక చిన్న గుడి ముందు ముగ్గుతో శ్రీరామ్ అని రాసిన ముగ్గు ఫొటోను ఆమె ట్వీట్ చేశారు. ‘చాలా ఇళ్లలో ప్రతిరోజు రంగోళీ, కోలమ్ను వేస్తారు. బియ్యంపిండితో ప్రతి రోజు ఫ్రెష్గా వేసుకుంటారు. మా ఇంటి దగ్గరలోని ఒక చిన్నగుడిలో ఈ రోజు ప్రత్యేకంగా ఇలా వేశారు’ అని మంత్రి ట్వీట్ చేశారు. ఈ మేరకు గుడి ముందు రంగోళీ వేసిన ఫొటోలు కూడా పోస్ట్ చేశారు. ‘అయోధ్య భూమి పూజన్’ అనే హ్యాష్ట్యాగ్ను కూడా ఉంచారు. ఎన్నో కోట్ల హిందువులు, ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్న కార్యక్రమం రామమందిరం నిర్మాణం ఈ రోజు షురూ కానుంది. ఈ మేరకు ప్రధాని మోడీ శంకుస్థాపన చేశారు. దీంతో దేశ వ్యాప్తంగా హిందువులు ప్రత్యేక పూజలు చేస్తూ, దీపాలు వెలిగిస్తూ సంతోషంగా జరుపుకుంటున్నారు.