Breaking News

యువతిపై గ్యాంగ్ రేప్​

యువతిపై గ్యాంగ్​రేప్​

అగర్తలా: బాలికలు, యువతులపై అకృత్యాలు కొనసాగుతునే ఉన్నాయి. తాజాగా త్రిపుర రాష్ట్రంలో ఓ యువతి (17)పై ఐదుగురు యువకులు సామూహికంగా లైంగికదాడి పాల్పడ్డారు. ఖోవాయి జిల్లాలోని ఖాసియమంగల్ ప్రాంతానికి చెందిన ఓ యువతిని ముగ్గురు యువకులు బలవంతంగా తమ వాహనంలో ఎక్కించుకొని అడవుల్లోకి లాక్కెల్లారు. అనంతరం ఆమెపై పాశవికంగా లైంగికదాడి చేశారు. దీంతో యువతి ఆపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. అయినా ఆ నరరూప రాక్షసుల కసి చల్లారలేదు. తమ స్నేహితులైన మరో ఇద్దరు యువకులను అక్కడికి పిలిపించి ఆమెపై లైంగికదాడికి ఉసిగొల్పారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనంగా మారింది. నిందితులను వెంటనే అరెస్ట్​ చేయాలని విద్యార్థి సంఘాలు, ప్రజాసంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాయి. విచారణ చేపట్టిన పోలీసులు ఐదుగురు యువకులను వారికి సహాయం చేసిన మరో ఐదుమందిని అరెస్ట్​ చేశారు. నిందితులను వెంటనే ఉరితీయాలని స్థానికులు డిమాండ్​ చేస్తున్నారు.