ముంబై : కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఐఐటీ ముంబై కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ సంవత్సరం నుంచి కేవలం ఆన్లైన్ క్లాసులను మాత్రమే నిర్వహిస్తున్నట్టు స్పష్టం చేసింది. ఆన్లైన్ క్లాసులు వినేందుకు పేద విద్యార్థులకు అవసరమైన ఆర్థిక సహాయం చేయాలని దాతలను కోరింది. వారు ఆన్లైన్ చదువులు కొనసాగించటానికి అవసరమైన ల్యాప్టాప్స్, ఇంటర్నెట్ కనెక్షన్లు, ఇతర సౌకర్యాలు కల్పించడానికి దాదాపు ఐదు కోట్ల రూపాయలు అవసరమవుతాయని దాతలు ముందుకు వచ్చి సహాయం చేయాలని విన్నవించింది.