Breaking News

ముంపు ప్రాంతాల్లో పర్యటన

ముంపు ప్రాంతాల్లో పర్యటన

సారథి న్యూస్​, కర్నూలు: కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. కర్నూలు జిల్లాలోని లోతట్టు కాలనీవాసుల ఇబ్బందులను తెలుసుకునేందుకు నేషనల్ ఉమెన్స్ పార్టీ వ్యవస్థాపకురాలు శ్రీమతి డాక్టర్ శ్వేతాశెట్టి సూచనల మేరకు గురువారం పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షురాలు హసీనాబేగం, జిల్లా సెక్రటరీ మున్ని పలు ప్రాంతాల్లో పర్యటించారు. కల్లూరు సమీపంలోని వకేర్ వాగు, లోతట్టు ప్రాంతాల్లో పర్యటించి స్థానికుల ఇబ్బందులను తెలుసుకున్నారు. వకేర్ వాగు కట్ట ఎత్తు పెంచాలని, లేకపోతే ముంపు ముప్పు పొంచి ఉందన్నారు. వారి వెంట విజయ్, జానీ, సిమ్రాన్ ఉన్నారు.