![ప్రశాంత్భూషణ్కు షాక్](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/08/PRASHANTH-BHUSHANNFF.jpg?fit=700%2C431&ssl=1)
న్యూఢిల్లీ: ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్కు సుప్రీంలో చేదు అనుభవం ఎదురైంది. ‘మీ క్షమాపణ మాకు అక్కర్లేదు. మీరు చేసిన వ్యాఖ్యలపై విచారణ కొనసాగిస్తాం’ అంటూ సుప్రీం కోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. 2009లో ఓ ఇంటర్వ్యూలో ఆయన సుప్రీంకోర్టు న్యాయమూర్తులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అక్కడున్న 16 మంది జడ్జీలు అవినీతిపరులేనంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఈ కేసును సోమవారం అత్యున్నత న్యాయస్థానం విచారించింది. అతని వివరణ, క్షమాపణలను సుప్రీం కోర్టు తిరస్కరించింది. అంతేకాకుండా అతని వ్యాఖ్యలు కోర్టు ధిక్కారం కిందకు వస్తాయా? లేదా? అన్నది పరిశీలించనున్నట్లు తెలిపింది. తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. మరో కోర్టు ధిక్కరణ కేసును కూడా సుప్రీంకోర్టు విచారిస్తోంది.