![మావోయిస్టుల దుశ్చర్యలను అడ్డుకుంటాం](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/07/WhatsApp-Image-2020-07-26-at-10.04.59-AM.jpeg?fit=1280%2C1280&ssl=1)
సారథి న్యూస్, ములుగు: మావోయిస్టుల బంద్ నేపథ్యంలో ములుగు జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా స్వయంగా ఆ జిల్లా ఓఎస్డీ కె. సురేష్ కుమార్ ఆయుధాన్ని చేతబట్టి స్పెషల్ పార్టీ సీఆర్పీఎఫ్ బలగాలతో అర్ధరాత్రిలో ములుగు జిల్లాలో కూంబింగ్ నిర్వహించారు. మావోయిస్టుల వారోత్సవాల నేపథ్యంలో వారి కదలికలపై నిఘావర్గాల సమాచారాన్ని సేకరిస్తూ వ్యూహాత్మకంగా వారిని నిరోధించడంలో పోలీస్ బలగాలకు మార్గనిర్దేశం చేశారు.