Breaking News

మహానటికి సర్కారు వారి స్వాగతం

మహానటికి ‘సర్కారువారి’ స్వాగతం


‘మహానటి’ తర్వాత టాలీవుడ్‌లో ఎంతో బిజీ అయిపోయింది కీర్తి సురేష్. వరుస తెలుగు సినిమాల ఆఫర్లు ఆమెను వరించడంతో పాటు తాజాగా మహేష్ బాబు సరసన కూడా నటించే అవకాశం అందుకుంది. పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘సర్కారు వారి పాట’ చిత్రంలో మహేష్​కు జంటగా కీర్తి సురేష్ పేరు కొన్నినెలలుగా వినిపిస్తోంది. ఇప్పుడి కాంబినేషన్‌ కన్ఫర్మ్ అయింది. శనివారం తన బర్త్ డే సందర్భంగా మహేష్ బాబు స్వయంగా ఈ విషయాన్ని రివీల్ చేస్తూ.. ‘సూపర్ టాలెంటెడ్‌ నటి కీర్తి సురేశ్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు.. ‘సర్కారు వారి పాట’ టీమ్ మీకు స్వాగతం పలుకుతోంది. మీ కెరీర్‌లో ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రంగా ఇది నిలుస్తుంది’ అని మహేష్ ట్వీట్ చేశాడు. అందుకు బదులుగా.. ‘థాంక్యూ మహేశ్ బాబు సర్. తొలిసారి మీతో కలిసి పనిచేస్తున్నందుకు హ్యాపీగా ఉంది.. ఇందుకోసం ఎదురు చూస్తున్నాను’ అంటూ రిప్లై ఇచ్చింది కీర్తి. మహేష్‌ కు చెందిన జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ నిర్మిస్తున్నాయి. తమన్ సంగీత దర్శకుడు. త్వరలో నితిన్‌ ‘రంగ్‌ దే’ మూవీ సాంగ్స్ షూటింగ్ కోసం ఇటలీ వెళ్లనుంది కీర్తి. ఆ సినిమా కంప్లీట్ అయ్యాకే మహేష్ మూవీ షూటింగ్‌లో పాల్గొంటుందని సమాచారం.