Breaking News

‘మహబూబాబాద్’ను తీర్చిదిద్దుదాం

సారథి న్యూస్​, మహబూబాబాద్: పారిశుద్ధ్య పనులకు ప్రజలు సహకరించాలని రాష్ట్ర గిరిజన, మహిళా శిశుసంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్ కోరారు. సోమవారం మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 34 ,19 వార్డుల్లో చేపడుతున్న పారిశుద్ధ్య పనులను ఆమె స్వయంగా పర్యటించి పరిశీలించారు. ప్రతి ఆదివారం ఉదయం 10:10 గంటలకు ప్రతి ఇంట్లో పారిశుద్ధ్య పనులను చేపట్టి.. వృథాగా ఉన్న వస్తువులు తొలగించాలని సూచించారు. మహబూబాబాద్ మున్సిపాలిటీని సుందరంగా తీర్చిదిద్దే కార్యంలో భాగస్వాములు కావాలని మంత్రి పిలుపునిచ్చారు. ఆమె వెంట కలెక్టర్ వీపీ గౌతమ్​, జడ్పీ చైర్​పర్సన్​ బిందు, మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్, మున్సిపల్ చైర్మన్ రామ్మోహన్ రెడ్డి, కమిషనర్ ఇంద్రసేనారెడ్డి పాల్గొన్నారు.