Breaking News

మరో ముగ్గురికి కరోనా పాజిటివ్

సారథి న్యూస్, నారాయణఖేడ్: సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం పరిధిలోని సిర్గాపూర్ మండలంలోని గరిడేగావ్ గ్రామాల్లో గత రెండు రోజుల క్రితం ఓ వ్యక్తి కరోనా వైరస్ రిపోర్ట్ పాజిటివ్ రావడంతో ఒక్కసారిగా కలవరపాటుకు గురైంది. మరో ముగ్గురికి కరోనా వైరస్ పాజిటివ్ వచ్చినట్లు డాక్టర్లు నిర్ధారించడంతో జనం భయంతో వణికిపోతున్నారు.

హైదరాబాద్ నుంచి ఈ నెల 10న వచ్చిన ఆయన ఖేడ్ లోని పలు గ్రామాల్లో తిరిగి బంధువులను కలిసినట్లు గుర్తించారు. వారిలో దాదాపు 30మంది వరకు హోం క్వారంటైన్ లో ఉంచారు. కొందరికి నెగెటివ్ రిపోర్ట్ రాగా ముగ్గురికి ప్రైమరీ కాంటాక్ట్ ద్వారా వైరస్ వ్యాపించిందని రిపోర్ట్ లో తెలిపారు. దీంతో మరోసారి నారాయణఖేడ్ డివిజన్ లో కరోనా కలవరం మొదలైంది.