Breaking News

మరోసారి చిరుత కలకలం

భయాందోళనలో రాజేంద్రనగర్​ ప్రజలు

సారథి న్యూస్​, రాజేంద్రనగర్​: హైదరాబాద్​ రాజేంద్రనగర్​లో చిరుతపులి మరోసారి కలకలం సృష్టించింది. దీంతో స్థానికులు భయాందోళనకు గురువుతున్నారు. ఫ్రొఫెసర్​ జయశంకర్​ వ్యవసాయ విశ్వవిద్యాలయం సమీపంలోని ఓ ఫామ్​హౌస్​లోకి చిరుత ప్రవేశించడంతో స్థానికులు గమనించి అటవీ అధికారులకు సమాచారమిచ్చారు. చిరుత కదలికలు సీసీ కెమెరాలో నమోదయ్యాయి. కొంతకాలంగా చిరుత పులి రాజేంద్రనగర్​ పరిసరాల్లో తిరుగుతుండటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. అటవీ అధికారులు తక్షణమే స్పందించి చిరుతను బంధించాలని ప్రజలు కోరుతున్నారు.