Breaking News

మనోజ్​ మరణం కలచివేసింది

సారథి న్యూస్​, హైదరాబాద్​: కరోనా(కోవిడ్ –19)తో జర్నలిస్ట్ మనోజ్ కుమార్​ మృతిచెందడం బాధాకరమని తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ ఆదివారం తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. మనోజ్ కుమార్​ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. కరోనా బారినపడి ఓ తెలుగు జర్నలిస్ట్ మృత్యువాతపడడం ఎంతో కలచి వేసిందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా మహమ్మారిని ఎదుర్కొనే విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం మినహా మరో మార్గం లేనందున జర్నలిస్టులు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలని, మనోజ్​ మరణం హెచ్చరిస్తుందని పేర్కొన్నారు. ఆయన కుటుంబసభ్యులు ధైర్యంగా ఉండాలని కోరారు. యువ జర్నలిస్టు మనోజ్​ మృతి బాధాకరమని మంత్రి వి.శ్రీనివాస్​గౌడ్​ ఆవేదన వ్యక్తంచేశారు. జర్నలిస్టు కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.