Breaking News

భారీ టెర్రర్‌‌ అటాక్‌కు ప్లాన్‌

  • తిప్పికొట్టిన సెక్యూరిటీ
  • 20 కేజీల ఐఈడీ ఉన్న కారు సీజ్‌

శ్రీనగర్‌‌: పుల్వామా జిల్లాలో భారీ టెర్రర్‌‌ అటాక్‌ను సెక్యూరిటీ సిబ్బంది తిప్పికొట్టింది. గురువారం తెల్లవారుజామున 20 కేజీల ఐఈడీతో ఉన్న వెహికిల్‌ను సీజ్‌చేశారు. పుల్వామాలో సీఆర్‌‌పీఎఫ్‌ కాన్వాయ్‌పై జరిగిన దాడి తరహాలో టెర్రరిస్టులు దీన్ని ప్లాన్‌ చేసినట్లు తెలుస్తోంది. డ్రైవర్‌‌ పరారీలో ఉన్నాడు. ఫేక్‌ రిజిస్ట్రేషన్‌తో వెళ్తున్న వెహికిల్‌ను చెక్‌ పాయింట్‌ వద్ద ఆపబోయారు. కానీ డ్రైవర్‌‌ వాహనాన్ని ఆపకుండా బారికేడ్లను ఢీకొట్టుకుంటూ ముందుకు వెళ్లిపోయాడని పోలీసులు చెప్పారు. దీంతో వెహికిల్‌ను వెంబడించిన సెక్యూరిటీ సిబ్బంది కాల్పులు జరిపారని, డ్రైవర్‌‌ పారిపోయాడని ఐజీ విజయ్‌కుమార్‌‌ చెప్పారు. ‘మాకు దీనిపై ముందే సమాచారం వచ్చింది. అందుకే బుధవారం నుంచి తనిఖీలు చేశాం’అని ఆయన అన్నారు.

బాంబ్‌ స్క్వాడ్​ టీమ్‌ ఐఈడీని, కారును ధ్వంసం చేసిందని, దాని కారణంగా దగ్గరలోని కొన్ని ఇళ్లు డ్యామేజ్‌ అయ్యాయని అధికారులు చెప్పారు. ఆర్మీ, పోలీస్‌, పారామిలటరీ ఫోర్స్‌ జాయింట్‌ ఆపరేషన్‌ చేయడం వల్ల పట్టుకోగలిగామని అన్నారు. డ్రైవర్‌‌ కోసం సెక్యూరిటీ సిబ్బంది గాలిస్తుందన్నారు. 2019 ఫిబ్రవరి 14న సీఆర్‌‌పీఎఫ్‌ జావన్ల కాన్వాయ్‌పై జైషే మహ్మద్‌ టెర్రరిస్టు గ్రూప్‌ జరిపిన బాంబు దాడిలో40 మంది జవాన్లు అమరులయ్యారు.